బాలుడిపై కుక్కల దాడి.. ప‌రిస్థితి విష‌మం

ఐదేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం ఉంద్రీగాంలో చోటుచేసుకుంది.

Update: 2024-04-24 05:56 GMT

దిశ‌, బెజ్జూరు: ఐదేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం ఉంద్రీగాంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయి తేజ(5) సంవత్సరాల బాలుడు బుధ‌వారం ఇంటి ముందర పిల్లల‌తో ఆడుకుంటున్నాడు. వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు. కుక్కలు బాలుడి త‌ల‌పై క‌ర‌వ‌డంతో ప‌రిస్థితి విష‌మ‌యంగా మారింది. దీంతో అత‌న్ని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇలాంటి ఘ‌ట‌న పున‌రావృతం కాకుండా అధికారులు చ‌ర్యలు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు. ఇటీవ‌లి కాలంలో కుక్కల దాడుల ఘ‌ట‌న‌లు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో పిల్లల‌పై ఓ క‌న్నేసి ఉంచాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Similar News