కలెక్టర్ సాక్షిగా... ప్రజాప్రతినిధుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు..!

గురువారం బైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్రమబద్ధీకరించిన ఇండ్లస్థలాల పట్టాల పంపిణీ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ అధికారిక కార్యక్రమంలో భార్యల స్థానంతో భర్తలు, కుటుంబీకులు హజరయ్యారు.

Update: 2023-02-23 10:46 GMT

దిశ, బైంసా : గురువారం బైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్రమబద్ధీకరించిన ఇండ్లస్థలాల పట్టాల పంపిణీ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ అధికారిక కార్యక్రమంలో భార్యల స్థానంతో భర్తలు, కుటుంబీకులు హజరయ్యారు. మహిళలకు అన్నిరంగాల్లో రాణించి, అవకాశాలు అందిపుచ్చుకునే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా అవకాశాలు కల్పించగా...ఆ పదవులు కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులులైన కుబీర్ ఎంపీపీ తూము లక్ష్మీబాయి స్థానంలో కొడుకు తూము రాజేశ్వర్, కుబీర్ సర్పంచ్ మీరా స్థానంలో భర్త విజయ్ హాజరవ్వడం, జెడ్పీటీసీ అల్కాతాయి స్థానంలో మామ మాజి ప్రజాప్రతినిధి శంకర్ చౌహన్, భైంసా జెడ్పీటీసీ సోలంకి దీపా స్థానంలో తండ్రి భీమ్రావు హాజరవ్వడంతో పలువురు ప్రజలు ఇందుకేనా..! రాజ్యాంగం ప్రకారం మహిళలకు అవకాశాలిచ్చిన మళ్లీ వాళ్ళను పక్కనే పెడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.

Tags:    

Similar News