రండి కాంగ్రెస్ లోకి స్వాగతం...

కాంగ్రెస్ పార్టీ దేశంలో అతిపెద్ద ప్రజాస్వామికమైనదని ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి అన్నారు.

Update: 2024-04-28 09:30 GMT

దిశ,బెల్లంపల్లి: కాంగ్రెస్ పార్టీ దేశంలో అతిపెద్ద ప్రజాస్వామికమైనదని ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేరికలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కొత్తగా పార్టీలో చేరే వారి వల్ల సీనియర్లకు ఏమాత్రం అన్యాయం జరగదని, వారికి పార్టీలో ఉండే ప్రాధాన్యత డోకా ఉండదని హామీ ఇచ్చారు. కొత్త పాత శ్రేణులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ లో ఒక కుటుంబంలో ఉండాలన్నారు.

ఈ విషయంలో సీనియర్ నాయకులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం చేరికల విషయంలో తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి శుభం కార్డు పడినట్లు అయింది. ఈ సమావేశంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Similar News