BRS ఎమ్మెల్యే మైనంపల్లి గెస్ట్‌హౌజ్‌లో దారుణం

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చెందిన ఫామ్‌హౌజ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Update: 2023-03-03 11:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చెందిన ఫామ్‌హౌజ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ మండలం జన్నేపల్లిలోని మైనంపల్లి గెస్ట్‌హౌజ్‌లో మరమత్తులు చేస్తూ ఇద్దరు కూలీలు మృతిచెందారు. రెండో అంతస్తులో గోడ కూలుస్తూ కిందపడి ఒకరు మృతిచెందగా.. తోటి కార్మికుడు కిందపడటం చూసి గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి.. నిజామాబాద్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News