సెక్రటేరియట్ సెక్యూరిటీ విషయంలో కీలక నిర్ణయం

35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Update: 2023-05-20 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం కమాండ్ కంట్రోల్ రూంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 1.60 కోట్ల జనాభా శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్ లలో కేసులు పెరుగుతుండటంతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూన్ 2 నుంచి కొత్త పీఎస్‌లు పనిచేస్తాయన్నారు. పెరుగుతున్న జనాభా మేరకు కొత్త పీఎస్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారన్నారు. సచివాలయం కోసం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News