హైదరాబాద్ లో కలకలం.. జువెనైల్‌ హోమ్ నుంచి 8 మంది చిన్నారులు పరార్

జువైనల్ హోమ్ నుంచి ఎనిమిది మంది చిన్నారులు తప్పించుకుని పరార్ కావడం కలకలం రేపింది.

Update: 2024-04-17 09:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జువైనల్ హోమ్ నుంచి ఎనిమిది మంది చిన్నారులు తప్పించుకుని పరార్ కావడం కలకలం రేపింది. హైదరాబాద్ సూరారం పరిధిలోని కైసర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల ఆచూకీ లభించకపోవడంతో నిర్వహాకులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తప్పించుకుపోయిన పిల్లలు ఎటువైపు వెళ్లారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News