కరోనా అలర్ట్.. కాస్త తగ్గిన COVID-19 కేసులు

భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 7,178 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

Update: 2023-04-24 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 7,178 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా వరుసగా వారం రోజుల నుంచి 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో 7,178 కేసులకు పడిపోవడం కాస్త ఉపసమణం కలిగించింది. కానీ భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 65,683గా ఉండటం.. ఆందోళన కలిగిస్తుంది. అలాగే గడిచిన 24 గంటల్లో భారత వ్యాప్తంగా.. 16 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ సానుకూలత రేటు 9.16%గా నమోదైంది. ఇప్పటివరకు 220 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లను అందించారు.

Tags:    

Similar News