41 కిలోమీటర్లు కాలినడకన.. తుల్జా భవాని గుడికి వినయ్ రెడ్డి

41 కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్లి వినయ్ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు.

Update: 2023-03-07 06:04 GMT

దిశ, ఆర్మూర్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో గల రూప భవాని అమ్మవారి ఆలయన్ని కాలినడకన వెళ్లి వినయ్ రెడ్డి దర్శించుకున్నారు. తుల్జా భవాని అమ్మవారి ఆలయం వరకు 41 కిలోమీటర్ల మేర నడిచి వినయ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేసి ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది చేసిన తరహాలోనే 18వసారి సైతం 41 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరవేసేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు సోమవారం చెప్పారు.

Tags:    

Similar News