108MP కెమెరా, AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్

టెక్నో కంపెనీ ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Tecno Pova 6 Pro 5G’

Update: 2024-03-29 11:24 GMT

దిశ, టెక్నాలజీ: టెక్నో కంపెనీ ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Tecno Pova 6 Pro 5G’. ఈ ఫోన్‌ను ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ఆవిష్కరించగా, శుక్రవారం ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ ప్రత్యేకంగా చార్జింగ్, కాల్ వివరాలను వంటి ఇతర హెచ్చరికలను డిస్‌ప్లేలోని హోల్ పంచ్ కటౌట్ చుట్టూ చూపుతుంది. దీని 8GB RAM+ 256GB వేరియంట్ ధర రూ. 19,999, 12GB RAM+ 256GB ధర రూ.21,999. కొనుగోలు సమయంలో బ్యంక్ ఆఫర్ ద్వారా రూ.2000 తగ్గింపు ఉంటుంది. దీంతో 8GB RAM వేరియంట్ రూ.17,999కే లభిస్తుంది. అదనంగా కంపెనీ రూ. 4,999 విలువ కలిగన Tecno S2 స్పీకర్‌‌ను కూడా అందిస్తుంది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, కంపెనీ రిటైల్ స్టోర్‌‌ల ద్వారా అమ్మకానికి ఉంటుంది. ఇది కామెట్ గ్రీన్, మెటోరైట్ గ్రే అనే కలర్స్‌లలో అందుబాటులో ఉంది.

Tecno Pova 6 Pro 5G ఫీచర్స్:

* 6.78-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,300 nits బ్రైట్‌నెస్

* MediaTek డైమెన్సిటీ 6080 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14తో రన్ అవుతుంది.

* బ్యాక్‌సైట్ 108MP కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది.

* ఫోన్ 70W వైర్డు ఫాస్ట్ చార్జింగ్‌‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Similar News