జగన్ మొహం చూసి ఒక్క పెట్టుబడి రాలేదు: లోకేశ్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత, మాజీమంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కంపెనీలన్నీ జగన్‌రెడ్డికి బైబై చెబుతున్నాయని, వైసీపీ నేతల బెదిరింపులతో రాష్ట్రం నుంచి పెట్టుబుడిదారులు పారిపోతున్నారని అన్నారు. జగన్‌రెడ్డి మొహం చూసి ఒక్క పెట్టుబడి రాష్ట్రానికి రాలేదన్న లోకేశ్.. సీఎం నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ విధానాలతో ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయన్నారు. విశాఖలో 15ఏళ్ల క్రితం ఏర్పాటై 2వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ […]

Update: 2021-01-09 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత, మాజీమంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కంపెనీలన్నీ జగన్‌రెడ్డికి బైబై చెబుతున్నాయని, వైసీపీ నేతల బెదిరింపులతో రాష్ట్రం నుంచి పెట్టుబుడిదారులు పారిపోతున్నారని అన్నారు. జగన్‌రెడ్డి మొహం చూసి ఒక్క పెట్టుబడి రాష్ట్రానికి రాలేదన్న లోకేశ్.. సీఎం నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ విధానాలతో ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయన్నారు. విశాఖలో 15ఏళ్ల క్రితం ఏర్పాటై 2వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బీసీ కంపెనీ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

Tags:    

Similar News