రైతు కంట కన్నీరు మంచిది కాదు : చంద్రబాబు

దిశ, ఏపీబ్యూరో : రైతు కన్నీరు పెట్టిన చోట రాజ్యం నిలవదనే నానుడి ఉంది. పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం రైతులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటం దారుణ మని చెప్పారు. రాజధాని అమరావతి రైతులు 372 రోజులుగా ఉద్యమిస్తున్నారని, దాదాపుగా 110 మందికిపైగా అన్నదాతలు అమరులైనట్లు గుర్తుచేశారు. వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని […]

Update: 2020-12-23 11:46 GMT

దిశ, ఏపీబ్యూరో : రైతు కన్నీరు పెట్టిన చోట రాజ్యం నిలవదనే నానుడి ఉంది. పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం రైతులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటం దారుణ మని చెప్పారు.

రాజధాని అమరావతి రైతులు 372 రోజులుగా ఉద్యమిస్తున్నారని, దాదాపుగా 110 మందికిపైగా అన్నదాతలు అమరులైనట్లు గుర్తుచేశారు. వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పరిహారం అడిగితే సభలో తమపైనే దాడికి తెగబడ్డారని ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇచ్చినట్లు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News