గృహిణి అనుమానాస్పద మృతి 

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కంజమ్మకొటాలు గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్చన అనే గృహిణి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. అర్చన బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్త మునియమ్మ, ఆడపడచు సుగుణలు తరచూ అర్చన ను వేధించేవారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, ఇప్పుడు కూడా అత్త, ఆడపడుచు వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. […]

Update: 2020-10-14 07:29 GMT

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కంజమ్మకొటాలు గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్చన అనే గృహిణి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. అర్చన బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అత్త మునియమ్మ, ఆడపడచు సుగుణలు తరచూ అర్చన ను వేధించేవారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, ఇప్పుడు కూడా అత్త, ఆడపడుచు వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. తమకు న్యాయం చేయాలని అర్చన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
slug: Suspicious death of housewife in kanjammakotalu village near kuppam
tags: kuppam mandal, chittoor district, housewife, suicide, police

Tags:    

Similar News