ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెర

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ మహాపోరులో ప్రధాన ఘట్టానికి ఆదివారంతో తెర పడుతోంది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమిషనర్​ సి.పార్థసారధి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ […]

Update: 2020-11-28 10:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ మహాపోరులో ప్రధాన ఘట్టానికి ఆదివారంతో తెర పడుతోంది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమిషనర్​ సి.పార్థసారధి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌, 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News