శ్రీలంకలో పర్యటించనున్న ఇంగ్లాండ్

దిశ, స్పోర్ట్స్ : కోవిడ్ మహమ్మారి కారణంగా శ్రీలంకలో జరగాల్సిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయి. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో జరగాల్సిన టెస్టు సిరీస్ వాయిదా వేసింది. తాజాగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2021 జనవరిలో నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. కరోనా కారణంగా రెండు టెస్టులను కూడా కొలంబోలోని గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 14-18 వరకు తొలి టెస్టు, జనువరి 22-26 వరకు రెండో టెస్టు జరుగనున్నది. […]

Update: 2020-12-09 11:42 GMT

దిశ, స్పోర్ట్స్ : కోవిడ్ మహమ్మారి కారణంగా శ్రీలంకలో జరగాల్సిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయి. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో జరగాల్సిన టెస్టు సిరీస్ వాయిదా వేసింది. తాజాగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2021 జనవరిలో నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. కరోనా కారణంగా రెండు టెస్టులను కూడా కొలంబోలోని గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 14-18 వరకు తొలి టెస్టు, జనువరి 22-26 వరకు రెండో టెస్టు జరుగనున్నది. ఇప్పటికే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడింది. దీంతో శ్రీలంక బోర్డుకు చాలా నష్టం వచ్చింది. తాజాగా ఇంగ్లాండ్ పర్యటన ద్వారా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించి ఖజానాను నింపుకోవాలని బోర్డు భావిస్తున్నది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News