WTC Final 2023: ఇంగ్లండ్ చేరుకున్న రోహిత్ శర్మ..

రెండు నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించిన ఐపీఎల్‌ 2023 16వ సీజన్‌ ముగిసింది.

Update: 2023-05-31 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించిన ఐపీఎల్‌ 2023 16వ సీజన్‌ ముగిసింది. ఇప్పుడు అందరి ఫోకస్ డబ్ల్యూటీసీ ఫైనల్ మీదకు మరలింది. ఈ క్రమంలోనే టీమిండియా సారధి రోహిత్ శర్మ కూడా ఇంగ్లండ్ చేరుకున్నాడు. అక్కడ భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ చేరుకున్న రోహిత్.. టీమిండియా కొత్త ప్రాక్టీస్ జెర్సీలో కనిపించాడు. ఇప్పటికే అక్కడ ఉన్న టీమ్ సభ్యులతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతని ఫొటోలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'అరండల్ క్యాసిల్ క్రికెట్ క్లబ్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమిండియాతో కలిశాడు' అని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News