ఆ విషయంలో టీమిండియా బౌలర్లు విఫలం.. సయ్యద్ అన్వర్ కీలక వ్యాఖ్యలు

ఆసిస్ తో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తి తేరిపోయారని పాకిస్థాన్ లెజెండ్ సయ్యద్ అన్వర్ అన్నాడు.

Update: 2023-09-26 11:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆసిస్ తో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తి తేరిపోయారని పాకిస్థాన్ లెజెండ్ సయ్యద్ అన్వర్ అన్నాడు. టీమిండియా బౌలర్లు ఆసిస్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్లను త్వరగా ఔట్ చేశారు. కానీ, టెయింలెండర్ల వద్దకు వచ్చేసరికి బౌలర్లు పూర్తిగా తేరిపోయారని అన్నారు. ఆసిస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడని, ఒకనొక దశలో స్కోర్ ఛేజ్ చేస్తారేమోనన్న సదేహం కలిగిందన్నాడు. ఒక వేళ టాపర్డర్, లోయర్ అర్డర్ ఆటగాళ్లను త్వరగా పెవిలియన్‌కు పంపితే భారత జట్టుకు తిరుగుండదని అన్నాడు. ఇప్పటికైనా వన్డే వరల్డ్ కప్ ఫెవరెట్ జట్లలో భారత్ ఒకటిని అన్వర్ ట్వీట్ చేశాడు.  

Tags:    

Similar News