మూడో టీ20లో సూర్య స్టన్నింగ్ క్యాచ్.. (వీడియో)
కివీస్తో జరిగిన మూడో టీ20లో భారత్ 168 పరుగుల తేడాతో రికార్డు విజయం సొంతం చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: కివీస్తో జరిగిన మూడో టీ20లో భారత్ 168 పరుగుల తేడాతో రికార్డు విజయం సొంతం చేసుకుంది. దీంతో మూడు టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ మూడు స్టన్నింగ్ క్యాచ్లను పట్టుకున్నాడు. అందులో రెండు క్యాచ్లు మ్యాచ్కు హైలైట్గా నిలిచాయి. ఇందులో స్లిప్లో తీసుకున్న రెండు క్యాచ్లు ఒకేలా ఉండటంతో మ్యాచ్ చూస్తున్న వారందరు రిప్లై చూస్తున్నామా అని షాక్కు గురయ్యారు. ఇక బ్యాటింగ్తోనూ సూర్య జట్టుకు కీలక పరుగులను జోడించాడు. 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.