రిషబ్ పంత్ బ్యాటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

గతేడాది కారు ప్రమాదం తర్వాత టీమ్ ఇండియా వికెట్ కీపర్ తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు

Update: 2023-08-16 14:44 GMT

న్యూఢిల్లీ: గతేడాది కారు ప్రమాదం తర్వాత టీమ్ ఇండియా వికెట్ కీపర్ తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు. బ్యాటింగ్ కూడా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది డిసెంబర్‌లో పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహబిలిటేషన్‌లో ఉన్న పంత్ గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవలే బీసీసీఐ సైతం పంత్ ఎన్‌సీఏలో బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.

మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పంత్ పాల్గొన్నాడు. అనంతరం నిర్వహించిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్‌ చేశాడు. కారు ప్రమాదం తర్వాత పంత్ బ్యాటు పట్టడం ఇదే తొలిసారి. క్రీజులో పంత్ చాలా సులువుగా కదిలాడు. అలాగే, భారీ షాట్లు కూడా ఆడాడు.

పంత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పంత్ వేగంగా కోలుకుంటుండటంతో త్వరలోనే తిరిగి జట్టులోకి వస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో అతను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News