రికార్డు సృష్టించిన పాకిస్తాన్ ..
దిశ, వెబ్డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏడు మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది.
దిశ, వెబ్డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏడు మ్యాచ్ల సిరీస్లో పాకిస్తాన్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది. ఈ సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాం ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బబార్ ఆజాం, 203 పరుగుల లక్ష్య ఛేదన చేసి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి సరికొత్త రికార్డు సృష్టించారు.
వీరిద్దరు ఓపెనింగ్ వికెట్కు నష్టపోకుండా అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ తమ అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసి రికార్డు సృష్టించారు. అయితే ఇదివరకు దక్షిణాఫ్రికాపై టీ20 మ్యాచ్లో ఓపెనింగ్ వికెట్కు 197 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం.. తాజాగా మునుపటి రికార్డును బ్రేక్ చేశారు.