టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్..
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది.
దిశ, వెబ్డెస్క్: లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు న్యూజిలాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈ మ్యాచ్కు భారత్ తన తుదిజట్టులో ఒకే ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ను తప్పించగా.. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
భారత తుది జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
న్యూజిలాండ్ తుది జట్టు:
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, డేరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్