ఆసియా కప్ టైటిల్ విజేత ఆ జట్టే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
ఆసియా కప్ 2022లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిశ, వెబ్డెస్క్: ఆసియా కప్ 2022లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2022 టైటిల్ను భారత్ జట్టు కైవసం చేసుకుంటుందని ఈ స్టార్ క్రికెటర్ జోస్యం చెప్పాడు. అలాగే గ్రూప్ స్టేజ్లో పాక్, భారత జట్ల మధ్య మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని.. ఈ గేమ్లో టీమిండియా గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ నేతృత్వంలోని బ్లూ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉందని అన్నారు. అయితే, పాక్ జట్టును తక్కువ అంచనా వేయలేమని.. తమదైన రోజు వారు చెలరేగిపోతారని తెలిపారు. కానీ, పెద్ద పెద్ద టోర్నీల్లో భారత్ అద్భుతంగా రాణిస్తుందని.. వారిని ఓడించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్, పాక్ల మ్యాచ్ను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో పోల్చారు. దాయాదుల మధ్య పోరు అంటే.. తనుకు ఎప్పుడూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ గుర్తుకు వస్తుందని తెలిపారు. ఆసియా కప్లో భారత్ అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తోందని అన్నారు. ఇక ఆసియా కప్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానుండగా.. గ్రూప్ స్టేజ్లో భాగంగా భారత్, పాక్ జట్లు ఈ నెల 28వ తేదీన తలపడనున్నాయి.