ఝులాన్ చివరి మ్యాచ్లో భారత్ సరికొత్త రికార్డ్..
దిశ, వెబ్డెస్క్: ఇంగ్లండ్ టూర్కి వెళ్లిన భారత్ సిరీస్ చివరి మ్యాచ్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేలో ఇంగ్లండ్ను..
దిశ, వెబ్డెస్క్: ఇంగ్లండ్ టూర్కి వెళ్లిన భారత్ సిరీస్ చివరి మ్యాచ్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ను భారత్ వైట్వాష్ చేసింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ను భారత్ వైట్వాష్ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఇదే ఇండియన్ పేసర్ ఝులన్ గోస్వామి కెరీర్ చివరి మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఇండియా 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 153 పరుగులకే వెనుదిరిగింది.
అయితే భారత పేసర్ ఝులాన్ గోస్వామి కెరీర్ చివరి మ్యాచ్లో భారత్ ఈ రికార్డ్ చేసింది. ఈ వన్డే సిరీస్ చివరి మ్యాచ్ ఝులాన్ గోస్వామి కెరీర్ లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో గోస్వామి రెండు వికెట్లు పడగొట్టింది. అయితే గోస్వామి చివరి మ్యాచ్ సందర్భంగా భారత మహిళా జట్టు సాధించిన ఈ ఘనత ఇండియన్ పేసర్కు గ్రేట్ గిఫ్ట్ అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.