అమ్మాయిలు అదరహో.. ఎఫ్‌ఐహెచ్ హాకీ 5s వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు క్వాలిఫై

గోల్స్ వర్షం కురిపించిన భారత ఆటగాళ్లు మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు.

Update: 2024-01-26 16:41 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. మస్కట్‌లో జరుగుతున్న ప్రారంభ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) హాకీ 5s వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం మొదట జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 11-1 తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. రుతుజా నాలుగు గోల్స్ చేయగా.. దీపిక మూడు గోల్స్ చేసింది. మంతాజ్ ఖాన్, మరియానా కుజుర్ రెండేసి గోల్స్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సెమీస్‌లో భారత్ 6-3 తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఫస్టాఫ్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలువగా.. సెకాండాఫ్‌లో భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. ఏకంగా నాలుగు గోల్స్ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. అక్షత, మరియానా, ముంతాజ్ ఖాన్, రుతుజ, జ్యోతి, అజ్మీనా కుజురు చెరో గోల్ చేశారు. నేడు ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తాడోపేడో తేల్చుకోనుంది.


Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News