U-19 WorldCup: ప్రపంచకప్ గెలిచిన టీమిండియా
భాతర మహిళా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.
దిశ, వెబ్డెస్క్: భాతర మహిళా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అండర్-19 వరల్డ్కప్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా వేదికగా ప్రపంచకప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారీ విజయాన్ని అందుకుంది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్పై భారత బౌలర్లు చెలరేగడంతో తక్కువ టార్గెట్ చేసింది. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 10 వికెట్ల నష్టానికి 68 పరుగులే చేసింది.
ఇక, 69 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు షెఫాలీ వర్మ (15) పరుగులతో రాణించగా.. శ్వేత షెరావత్ (5) స్కోర్కే ఔట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సౌమ్య తివారి, త్రిష దూకుడుగా ఆడి మ్యాచ్ గెలిపించారు. సౌమ్య తివారి (24), త్రిష (24) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఇందులో అలెక్సా, హన్నా బేకర్, గ్రేస్ స్క్రీవెన్స్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపిన ఇంగ్లాండ్ గ్రేస్ స్క్రివెన్స్ (4) లిబర్టీ హీప్ (0) పరిమితమయ్యారు. హోలాండ్ (10) , సెరెన్ స్మెల్ (3) రైన్ మెక్ డొనాల్డ్ (19) మాత్రమే చేశారు. భారత బౌలర్లలో సదు,అర్చన దేవి, చోప్రా.. రెండు వికెట్లతో సత్తాచాటగా.. కశ్యప్, షఫాలీ వర్మ,సోనమ్ యాదవ్ తలా ఒక్క వికెట్ తీశారు.