టీ20 సిరీస్ బంగ్లాదే.. జింబాబ్వేపై వరుసగా మూడో విజయం

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది.

Update: 2024-05-07 13:56 GMT

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. చటోగ్రామ్‌ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో జింబాబ్వేపై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. తౌహిద్ హృదయ్(57) హాఫ్ సెంచరీతో రెచ్చిపోగా.. వికెట్ కీపర్ జాకర్ అలీ(44) రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే పోరాడగా బంగ్లా బౌలర్లు అడ్డుకున్నారు. దీంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 156/9 స్కోరుకే పరిమితమైంది. ఫరాజ్ అక్రమ్(34 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బంగ్లా బౌలర్లలో మహ్మద్ సైఫుద్దీన్(3/42) సత్తాచాటాడు. ఈ నెల 10న ఢాకా వేదికగా నాలుగో టీ20 జరగనుంది.

Tags:    

Similar News