టీమిండియాకు గెలిచే సీన్ లేదు.. బోర్డర్ గవాస్కర్ సిరీస్పై శ్రీలంక మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్దనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
దిశ, వెబ్డెస్క్: టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్దనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియా కు గెలిచే సీన్ లేదు.. బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆస్ట్రేలియాదే అని జోస్యం చెప్పాడు. భారత్ వేదికగా జరగనున్న ఈ సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఈ సిరీస్ గెలవడం కీలకంగా మారనుంది. కేవలం రెండు సార్లు మాత్రమే భారత్ను సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓడించింది. 1964, 2004 పర్యటనల్లో ఆసీస్ గెలుపొందింది. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకోవచ్చు. అయితే ఈ విజయం అంత సులువైనది కాదని జయవర్దనే చెప్పుకొచ్చాడు.