మద్యం మత్తులో తండ్రిని అలా చేసిన కొడుకు.. షాక్‌లో కుటుంబ సభ్యులు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యంమత్తులో కన్న తండ్రినే హత్య చేశాడు కొడుకు. ఈ ఘటన జిల్లాలోని కొనకనమిట్ల మండలం నాగంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. తాగి వచ్చాక తండ్రీ కొడుకుల మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలోనే ఆదివారం కొడుకు తాగి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవజరగడంతో ఆగ్రహానికి లోనైన కుమారుడు మద్యం మత్తులో తండ్రిని కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. దీంతో తండ్రి […]

Update: 2021-11-29 00:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యంమత్తులో కన్న తండ్రినే హత్య చేశాడు కొడుకు. ఈ ఘటన జిల్లాలోని కొనకనమిట్ల మండలం నాగంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. తాగి వచ్చాక తండ్రీ కొడుకుల మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలోనే ఆదివారం కొడుకు తాగి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవజరగడంతో ఆగ్రహానికి లోనైన కుమారుడు మద్యం మత్తులో తండ్రిని కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. దీంతో తండ్రి పాపయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రౌడీషీటర్ పాపయ్యగా గుర్తింపు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందుతున్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News