మొదటిరోజే ఆశపడిన సోము.. సాధ్యమయ్యేనా ?

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు కుటుంబ పార్టీలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడారు. నిజమైన అభివృద్ధి ఏపీకి అత్యవసరమని, బీజేపీ కీలక భూమిక పోషించే సమయం వచ్చిందని, ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు ఫలాలను అందించడమే బీజేపీ లక్ష్యం అని, ఆఖరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలాలు […]

Update: 2020-08-11 00:05 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు కుటుంబ పార్టీలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడారు. నిజమైన అభివృద్ధి ఏపీకి అత్యవసరమని, బీజేపీ కీలక భూమిక పోషించే సమయం వచ్చిందని, ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు ఫలాలను అందించడమే బీజేపీ లక్ష్యం అని, ఆఖరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నారు.

సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమే అని, ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే మోడీ లక్ష్యమని, ఏపీ అభివృద్ధికి బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News