బ్యాంక్‌లో చోరీకి యత్నం…

దిశ, బోధన్: నిజమాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం సాటపూర్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఆదివారం రాత్రి బ్యాంక్ కిటికీలు పగలకొట్టి బ్యాంక్ లోనికి ప్రవేశించిన దొంగలు దోపిడీకీ ప్రయత్నించారు. కానీ దొంగతనం చేయలేదు. సోమవారం ఉదయం బ్యాంకు సిబ్బంది తాళాలు తీసి లోనికి వెళ్లడంతో చోరీకి ప్రయత్నించినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించి, క్లూస్ టీమ్‌తో వివరాలు సేకరిస్తున్నట్టు బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. బ్యాంకు సీసీ కెమెరాలు […]

Update: 2020-09-21 04:01 GMT

దిశ, బోధన్: నిజమాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం సాటపూర్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఆదివారం రాత్రి బ్యాంక్ కిటికీలు పగలకొట్టి బ్యాంక్ లోనికి ప్రవేశించిన దొంగలు దోపిడీకీ ప్రయత్నించారు. కానీ దొంగతనం చేయలేదు. సోమవారం ఉదయం బ్యాంకు సిబ్బంది తాళాలు తీసి లోనికి వెళ్లడంతో చోరీకి ప్రయత్నించినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించి, క్లూస్ టీమ్‌తో వివరాలు సేకరిస్తున్నట్టు బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. బ్యాంకు సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Tags:    

Similar News