భారీ వర్షాలు.. గోడకూలి ఆరుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేని భారీ వర్షాలతో గోడ కూలి ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్ చంద్రబాగ నది ఒడ్డున బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. గోడ కూలిన కొద్దిసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు.  

Update: 2020-10-14 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేని భారీ వర్షాలతో గోడ కూలి ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్ చంద్రబాగ నది ఒడ్డున బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. గోడ కూలిన కొద్దిసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు.

 

Tags:    

Similar News