Crime News :డ్యూటీలో ఎస్‌ఐ దారుణం.. కానిస్టేబుల్‌పై అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే తన బాధ్యతను మర్చిపోయి ప్రవర్తించాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయనే. తనతో కలిసి పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా గోపాలపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యాస్ సైక్లోన్ నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు గోపాలపూర్ అవుట్ పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. అందులో భాగంగా ఒక మహిళా కానిస్టేబుల్‌ను కూడా ఇక్కడ విధుల్లో నియమించారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ బన్సీధర్ […]

Update: 2021-05-28 20:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే తన బాధ్యతను మర్చిపోయి ప్రవర్తించాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయనే. తనతో కలిసి పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా గోపాలపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

యాస్ సైక్లోన్ నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు గోపాలపూర్ అవుట్ పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. అందులో భాగంగా ఒక మహిళా కానిస్టేబుల్‌ను కూడా ఇక్కడ విధుల్లో నియమించారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ బన్సీధర్ ప్రధాన్ మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశాడు. దీనిపై సదరు మహిళా కానిస్టేబుల్ స్ధానిక కుంటాపడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఎస్‌ఐని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపి, ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News