వనపర్తి మృతుల కేసులో సంచలన విషయాలు

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి విష ప్రయోగం చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఎవరు విష ప్రయోగం చేశారు, ఎందుకు చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారే విషం తీసుకున్నారా అన్న కోణంలోనూ స్పెషల్‌ టీమ్‌తో విచారణ చేస్తున్నారు. ఆజీరాం, ఆమె కూతురు బేస్మా బేగం, అల్లుడు పాషా, మనవరాలు హసినా మృతదేహాలు వారి ఇంట్లో వేర్వురుగా […]

Update: 2020-08-14 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి విష ప్రయోగం చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఎవరు విష ప్రయోగం చేశారు, ఎందుకు చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారే విషం తీసుకున్నారా అన్న కోణంలోనూ స్పెషల్‌ టీమ్‌తో విచారణ చేస్తున్నారు.

ఆజీరాం, ఆమె కూతురు బేస్మా బేగం, అల్లుడు పాషా, మనవరాలు హసినా మృతదేహాలు వారి ఇంట్లో వేర్వురుగా పడి ఉండటంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉంటాయని అనుమానించారు.

Tags:    

Similar News