సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలి: జగన్

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు-నేడు మనబడిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని, స్కూళ్లు తెరిచేనాటికి నాడు-నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలన్నారు. ప్రతి స్కూల్ విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ఇందుకోసం నిధులకు కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా, కరోనా కారణంగా […]

Update: 2020-08-04 02:34 GMT

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు-నేడు మనబడిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని, స్కూళ్లు తెరిచేనాటికి నాడు-నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలన్నారు. ప్రతి స్కూల్ విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ఇందుకోసం నిధులకు కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా, కరోనా కారణంగా మార్చి 22 నుంచి స్కూళ్ల మూతబడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News