ఎట్టకేలకు గెహ్లాట్‌తో పైలట్ భేటీ

దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాజకీయాల్లో వేడి పుట్టించిన కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ యూ టర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకతో భేటీ అయిన పైలట్ తన తిరుగుబాటకు రెడ్ సిగ్నల్ వేసుకున్నాడు. అధిష్టానానికి పలు సమస్యలను వివరించిన పైలట్ అక్కడి నుంచి సానుకూల హామీ రావడంతో పంతా మార్చుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సచిన్ పైలట్ బుధవారం తిరిగి రాజస్తాన్ చేరుకున్నారు. అయితే, రాజస్తాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం […]

Update: 2020-08-13 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాజకీయాల్లో వేడి పుట్టించిన కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ యూ టర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకతో భేటీ అయిన పైలట్ తన తిరుగుబాటకు రెడ్ సిగ్నల్ వేసుకున్నాడు. అధిష్టానానికి పలు సమస్యలను వివరించిన పైలట్ అక్కడి నుంచి సానుకూల హామీ రావడంతో పంతా మార్చుకున్నాడు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సచిన్ పైలట్ బుధవారం తిరిగి రాజస్తాన్ చేరుకున్నారు. అయితే, రాజస్తాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అశోక్ గెహ్లాట్ నివాసంలో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సచిన్ పైలట్‌ను స్వయంగా సీఎం గెహ్లాట్ సాదరంగా ఆహ్వానించడం గమనార్హం.

Tags:    

Similar News