పాతబస్తీలో రౌడీ షీటర్‌ దారుణ హత్య

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ పాతబస్తీలో శుక్రవారం అర్థరాత్రి హత్య జరిగింది. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్సారీరోడ్డు వద్ద రౌడీషీటర్ మహ్మద్ జావేద్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో విచక్షణ రహితంగా నరికి పారిపోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తీవ్రగాయాలతో రక్తపు మడుగులతో కొట్టుమిట్టాడుతున్న జావేద్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Update: 2020-09-05 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ పాతబస్తీలో శుక్రవారం అర్థరాత్రి హత్య జరిగింది. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్సారీరోడ్డు వద్ద రౌడీషీటర్ మహ్మద్ జావేద్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో విచక్షణ రహితంగా నరికి పారిపోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తీవ్రగాయాలతో రక్తపు మడుగులతో కొట్టుమిట్టాడుతున్న జావేద్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News