పొలానికి వెళ్తూ షాకైన సర్పంచ్.. తమ గ్రామస్తుడిని అలా చూసి..

దిశ, మక్తల్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఖానాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ నర్సింహులు పొలానికి వెళ్తుండగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి సోమప్ప(32) రోడ్డు ప్రమాదంలో చనిపోయి పడి ఉన్న ఘటన చూసి పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఖానాపూర్ గ్రామానికి చెందిన సోము మాగనూరు మండలం […]

Update: 2021-11-16 03:04 GMT

దిశ, మక్తల్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఖానాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ నర్సింహులు పొలానికి వెళ్తుండగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి సోమప్ప(32) రోడ్డు ప్రమాదంలో చనిపోయి పడి ఉన్న ఘటన చూసి పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఖానాపూర్ గ్రామానికి చెందిన సోము మాగనూరు మండలం అమ్మ పల్లి గ్రామానికి చెందిన బంధువుల పెళ్ళికి వెళ్లి సోమవారం మధ్య రాత్రి తిరిగి స్వగ్రమానికి వస్తుండగా హెచ్.పీ గ్యాస్ గోడౌన్ రోడ్డు మలుపు దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు పక్కన చనిపోయి పడి ఉన్నాడు. అయితే అక్రమ ఇసుక ట్రాక్టర్ల కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చునని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News