కామారెడ్డి : జనాల మీదికి దూసుకెళ్లిన ట్రాక్టర్

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ ఎక్సల్ విరిగిపోవడంతో జనాల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో కావేరి హోటల్ వద్ద పార్క్ చేసిన కారును ట్రాక్టర్ ఢీ కొనడంతో కారు ధ్వంసమైంది. కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే ట్రాక్టర్ దూసుకెళ్తున్న సమయంలో జనాలు ఎవరూ రోడ్ల పైన లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప […]

Update: 2021-06-12 01:15 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ ఎక్సల్ విరిగిపోవడంతో జనాల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో కావేరి హోటల్ వద్ద పార్క్ చేసిన కారును ట్రాక్టర్ ఢీ కొనడంతో కారు ధ్వంసమైంది. కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే ట్రాక్టర్ దూసుకెళ్తున్న సమయంలో జనాలు ఎవరూ రోడ్ల పైన లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

Tags:    

Similar News