ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు మృతి

దిశ‌, ఐన‌వోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు మండ‌లం లింగమోరిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక‌క్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని ఏలియా (40), కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. మృతులిద్దరిది ఐన‌వోలు మండ‌లంలోని ఉడ‌త‌గూడెనికి చెందిన వారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు త‌ర‌లించారు. ఈ ప్రమాద […]

Update: 2021-11-14 06:45 GMT

దిశ‌, ఐన‌వోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు మండ‌లం లింగమోరిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక‌క్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని ఏలియా (40), కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. మృతులిద్దరిది ఐన‌వోలు మండ‌లంలోని ఉడ‌త‌గూడెనికి చెందిన వారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు త‌ర‌లించారు. ఈ ప్రమాద ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News