కరోనాతో జర్నలిస్టు మృతి.. లాడ్జిలో తలదాచుకుంటున్న కుటుంబం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను ఛిద్రం చేసింది. మరీ ముఖ్యంగా పేద కుటుంబాలను అతలాకుతలం చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి పేద కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. ఇటీవల అనేకమంది పేదలు కరోనా బారినపడి దిక్కుతోచని స్థితిలో మరణిస్తున్నారు. తాజాగా.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కాశిబుగ్గ రిపోర్టర్ నాగరాజు మృతిచెందారు. దీంతో రోడ్డునపడ్డ ఆయన కుటుంబం దయనీయ జీవితం గడుపుతోంది. స్టేషన్‌రోడ్‌లోని ఓ లాడ్జ్‌లో తల దాచుకుంటూ దుర్భర జీవనం […]

Update: 2021-05-04 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను ఛిద్రం చేసింది. మరీ ముఖ్యంగా పేద కుటుంబాలను అతలాకుతలం చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి పేద కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. ఇటీవల అనేకమంది పేదలు కరోనా బారినపడి దిక్కుతోచని స్థితిలో మరణిస్తున్నారు. తాజాగా.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కాశిబుగ్గ రిపోర్టర్ నాగరాజు మృతిచెందారు. దీంతో రోడ్డునపడ్డ ఆయన కుటుంబం దయనీయ జీవితం గడుపుతోంది. స్టేషన్‌రోడ్‌లోని ఓ లాడ్జ్‌లో తల దాచుకుంటూ దుర్భర జీవనం కొనసాగిస్తోంది. రిపోర్టర్ భార్య, కూతురు, అమ్మ, భర్త వదిలేసిన చెల్లెలు మొత్తం నలుగురూ ఆడవాళ్ళే కావడంతో ఓనర్ ఇంట్లోంచి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం లాడ్జ్‌లో తల దాచుకుంటున్నారు. అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News