‘రెడ్‌క్రాస్ సేవలు ప్రశంసనీయం’

దిశ, మహబూబ్ నగర్: పేదలకు రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. రాష్ర్ట ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ జన్మదినం సందర్భంగా ఏనుగొండలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అనాథాశ్రమo, శాంతివన్, అక్షర పాఠశాల విద్యార్థులకు రెండు క్వింటాళ్ల బియ్యం, మూడు ట్రై సైకిళ్ళు, 100 దుప్పట్లు, వాటర్ బాటిళ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ.. దాతల సహకారంతో అనాథాశ్రమం, శాంతివన్, […]

Update: 2020-03-16 06:43 GMT

దిశ, మహబూబ్ నగర్: పేదలకు రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. రాష్ర్ట ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ జన్మదినం సందర్భంగా ఏనుగొండలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అనాథాశ్రమo, శాంతివన్, అక్షర పాఠశాల విద్యార్థులకు రెండు క్వింటాళ్ల బియ్యం, మూడు ట్రై సైకిళ్ళు, 100 దుప్పట్లు, వాటర్ బాటిళ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ.. దాతల సహకారంతో అనాథాశ్రమం, శాంతివన్, అక్షర పాఠశాలలను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. రెడ్‌క్రాస్ సేవలు మరింతగా విస్తరించాలని సూచించారు.

tags : Red Cross Society, Services, collector venkatrao, minister srinivas goud, rise, Tri bicycles, mahaboobnagar

Tags:    

Similar News