రానా, రవితేజ మల్టీస్టారర్..?

మలయాళీ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌పై ఫిల్మ్ నగర్‌లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే ‘రానా దగ్గుబాటి’ ఓకే చెప్పగా.. నందమూరి బాలకృష్ణను ఈ సినిమాలో ఎలాగైనా నటింపజేయాలని చాలా ప్రయత్నించినట్లు సమాచారం. ఇది వర్క్ అవుట్ కాకపోవడంతో చివరికి ఆ ఆఫర్ మాస్ మహారాజా రవితేజను వరించిందట. మల్టీస్టారర్ సినిమాకు సరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కావడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు […]

Update: 2020-06-15 05:07 GMT

మలయాళీ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌పై ఫిల్మ్ నగర్‌లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే ‘రానా దగ్గుబాటి’ ఓకే చెప్పగా.. నందమూరి బాలకృష్ణను ఈ సినిమాలో ఎలాగైనా నటింపజేయాలని చాలా ప్రయత్నించినట్లు సమాచారం. ఇది వర్క్ అవుట్ కాకపోవడంతో చివరికి ఆ ఆఫర్ మాస్ మహారాజా రవితేజను వరించిందట. మల్టీస్టారర్ సినిమాకు సరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కావడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఒరిజినల్ మూవీలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ నటించిన ప్రధాన పాత్రలకు తెలుగులో రవితేజ, రానా డేట్స్ ఇచ్చేయగా.. ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సాచి దర్శకత్వం వహించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి తెలుగులో ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News