తమిళనాడుకు హెచ్చరిక

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో గతకొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ఈరోడ్, ధర్మపురి, దిండిగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుచోట్ల గ్రామాలు నీటమునిగాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. కుట్రాలం, పాపవినాశనం సహా జలపాతాలను మూసివేశారు. మరోవైపు 48 గంటలపాటు చెన్నై, చెంగల్ పట్టు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని […]

Update: 2020-08-09 22:58 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో గతకొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ఈరోడ్, ధర్మపురి, దిండిగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుచోట్ల గ్రామాలు నీటమునిగాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. కుట్రాలం, పాపవినాశనం సహా జలపాతాలను మూసివేశారు.

మరోవైపు 48 గంటలపాటు చెన్నై, చెంగల్ పట్టు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tags:    

Similar News