ఒంటి గంట దాటినా 20 % దాటలేదు

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నామమాత్రంగా జరుగుతోంది. నగర పరిధిలోని ఓటర్లు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపించడం లేదు. ఒంటి గంట దాటినా పోలింగ్ 20 శాతం దాటలేదు. కాగా, ఉదయం 9 గంటల వరకు 3.90 పోలింగ్ శాతం ఉండగా.. 11 గంటల వరకు 8.90 శాతం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 18.20 పోలింగ్ శాతం నమోదైంది. […]

Update: 2020-12-01 02:51 GMT

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నామమాత్రంగా జరుగుతోంది. నగర పరిధిలోని ఓటర్లు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపించడం లేదు. ఒంటి గంట దాటినా పోలింగ్ 20 శాతం దాటలేదు. కాగా, ఉదయం 9 గంటల వరకు 3.90 పోలింగ్ శాతం ఉండగా.. 11 గంటల వరకు 8.90 శాతం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 18.20 పోలింగ్ శాతం నమోదైంది.

నగర శివార్లలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. ఇక ఓటు విషయంలో వికలాంగులు, వయోవృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News