Nandamuri Balakrishna: రెక్కలు విరిగిపోతాయి.. జగన్‌పై బాలయ్య ఫైర్

తాజగా నందమూరి బాలకృష్ణ అనంతపురంలోని కుల్లూరులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-14 15:00 GMT

దిశ వెబ్ డెస్క్: తాజగా నందమూరి బాలకృష్ణ అనంతపురంలోని కుల్లూరులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకుని రూ/ లక్షల కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. అదీ చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఓవైపు దళితులకు అండగా ఉంటానని చెప్తూనే మరో వైపు దళితులను హత్యా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలను జగన్ రద్దు చేసి వాళ్లకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అలానే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం తథ్యం అని జోస్యం చెప్పారు. అలానే రానున్న ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News