Konidela Naga Babu: పిఠాపురానికి కడప రౌడీలు, గుండాలు.. కొణిదెల నాగబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.

Update: 2024-04-26 10:21 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకి, కూటమి నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు, కడప నుండి గుండాలు, రౌడీలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ కుట్ర వెనక వైసీపీ నేతలు మిథున్ రెడ్డి దాడిశెట్టి రాజా రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వారిరువురూ కలిసి పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా.. ఎంతమందిని తీసుకొచ్చిన పవన్‌ను ఓడించడం అసాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంతమందిని తీసుకువచ్చినా.. తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎంతమంది వస్తారో రండి.. చూసుకుందాం.. అని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు

Read More..

Viral Pics: నామినేషన్ ర్యాలీపై ట్రోల్స్.. ఏకంగా శవయాత్ర అంటూ షాకింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News