కుల పిచ్చితో విషం చిమ్ముతోంది: విజయసాయిరెడ్డి
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు..Latest Telugu News
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. ''ఆంధ్రాకు పట్టిన గ్రహణం పచ్చ కుల మీడియా. విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజా సేవలో ఉన్న మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది. దస్పల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే.'' అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చ కుల మీడియా. విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజా సేవలో ఉన్న మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది. దస్పల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2022