లింగాయత్‌లు మాతోనే ఉన్నారు: బీజేపీ

లింగాయత్‌లు బీజేపీకే మద్దతు ఇస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ ఆదివారం లింగాయత్ కమ్యూనిటీ ప్రకటన చేసింది.

Update: 2023-05-08 09:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లింగాయత్‌లు బీజేపీకే మద్దతు ఇస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ ఆదివారం లింగాయత్ కమ్యూనిటీ ప్రకటన చేసింది. అయితే లింగాయత్ కమ్యూనిటీ 100 శాతం తమతోనే ఉందని యడియూరప్ప తెలిపారు. తమ మధ్య సమస్యలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు దాదాపు అందరూ లింగాయత్ స్వాములు తమతో చెప్పారని మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

Tags:    

Similar News