ప్రజలకు పోలీసుల హెచ్చరిక..

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు. తప్పనిసరిగా ప్రజలు మాస్కు ధరించాలని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని హెచ్చరించారు. అయితే, ప్రజలు మాస్కులు ధరించేలా వారంరోజుల పాటు అవగాహన కల్పించనున్నట్టు సీపీ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.  

Update: 2021-03-30 04:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు. తప్పనిసరిగా ప్రజలు మాస్కు ధరించాలని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని హెచ్చరించారు.

అయితే, ప్రజలు మాస్కులు ధరించేలా వారంరోజుల పాటు అవగాహన కల్పించనున్నట్టు సీపీ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

 

Tags:    

Similar News