సీఆర్ఎఫ్ ద్వారా చేపట్టిన ప్రాజెక్ట్ల వివరాలు తెలపండి.. ప్రశ్నించిన వైసీపీ ఎంపీ
దిశ, ఏపీ బ్యూరో: సెంట్రల్ రోడ్ ఫండ్( సీఆర్ఎఫ్)ను ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్ల కోసం ఖర్చు చేస్తున్న విషయంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. 2021-22లో సీఆర్ఎఫ్ నిధులను వినియోగించి ఏ ప్రాజెక్టులను చేపట్టారు… సీఆర్ఎఫ్ నుంచి ఎంత శాతం రోడ్లు, హైవేలు, జలమార్గాలు, ఇతర ప్రాజెక్ట్లకు కేటాయించాలన్న నిర్ణయం జరిగింది అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ […]
దిశ, ఏపీ బ్యూరో: సెంట్రల్ రోడ్ ఫండ్( సీఆర్ఎఫ్)ను ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్ల కోసం ఖర్చు చేస్తున్న విషయంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. 2021-22లో సీఆర్ఎఫ్ నిధులను వినియోగించి ఏ ప్రాజెక్టులను చేపట్టారు… సీఆర్ఎఫ్ నుంచి ఎంత శాతం రోడ్లు, హైవేలు, జలమార్గాలు, ఇతర ప్రాజెక్ట్లకు కేటాయించాలన్న నిర్ణయం జరిగింది అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
దీనికి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సభలో సమాధానం చెప్పారు. 2018లో జరిగిన సవరణ అనంతరం సీఆర్ఎఫ్ను సెంట్రల్ రోడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఫండ్గా పేరు మార్చడం జరిగిందని వెల్లడించారు. సీఆర్ఐఎఫ్ పూర్తిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేశారు. సీఆర్ఐఎఫ్ నిధులను ఉపయోగించి చేపట్టే ఇన్ఫ్రా, అభివృద్ధి ప్రాజెక్ట్లకు కేటాయింపులు, పర్యవేక్షణ ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోనే జరుగుతుందని మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు.