అనుమానాస్పద స్థితిలో ఫోటోగ్రాఫర్ మృతి

దిశ,మానకొండూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మానకొండూరు మండలంలోని మానేరు ఒడ్డున ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయం వద్ద శవం లభ్యం అయింది. నాలుగైదు రోజులుగా ఆలయం వద్ద ఓ టూవీలర్ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో వెతకగా వారికి శవం దొరికింది. మృతుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం […]

Update: 2021-04-02 01:23 GMT

దిశ,మానకొండూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మానకొండూరు మండలంలోని మానేరు ఒడ్డున ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయం వద్ద శవం లభ్యం అయింది. నాలుగైదు రోజులుగా ఆలయం వద్ద ఓ టూవీలర్ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో వెతకగా వారికి శవం దొరికింది. మృతుడు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాల పల్లి గ్రామానికి చెందిన కోహెడ రమేష్ గా గుర్తించారు. రమేష్ కొంతకాలంగా గోదావరిఖనిలో ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడని, అతను చివరగా తన భార్యతో మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి చావుకు గల కారణాలు ఏంటీ అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News